ఉపాధిహామీ లక్ష్యం మంచిదే.. కానీ సమాచారం మెట్ల
ఉపాధిహామీ సమాచారం కోసం ఆర్టిఐ దరఖాస్తు..?ఎంబి రికార్డులు లేవు తెల్ల పేపర్లు మీద రాశారు అంటూ ఓ అధికారి సమాధానం..?
ఒక్క మండలంలో ఇలా ఉంటే ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో..!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఉపాధి హామీ పథకం 2005లో ప్రతిష్టాత్మకంగా చట్టం చేసి అమలు జరుపుతున్న నేపధ్యం. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులకు పెద్దపీట వేసి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ విధానాలు మారటం మూలంగా ప్రతి సంవత్సరం ఉపాధి హామీలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ 2006 2007 సంవత్సరానికి సంబంధించి సమాచారం కావాలని ఓ సామాజిక కార్యకర్త ఆర్టిఐ ద్వారా ఖమ్మం జిల్లా లోని ఓ మండల అధికారులకు దరఖాస్తు అందించారు ఆపై ఆ మండల అధికారులు సమయంతో సహా రిసీవ్డ్ ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారుల నుండి మండల అధికారికి దస్త్రం చేరింది. ఈ విషయంపై సదరు అధికారి స్పందిస్తూ ఆనాడు ఎంబిలను చేయలేదు. తెల్ల పేపర్ పై కూలీల మస్టరు రాసి దాని వెనుక ఎంబీ చేశారు అంటూ.. వివరాలు కోసం వెతుకుతున్నాం మూడు సాఫ్ట్వేర్లు మారాయి అంటూ సాఫ్ట్ గా సమాధానం ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ఉపాధి హామీ పథకంలో దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇచ్చేందుకు అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.




