నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ ఏప్రిల్ 2) కలవాయి మండలం పెన్నా బద్దెవోలుఅమరావతికి పట్టిన గ్రహణం వీడింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టానికి సవరణ చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.ఈ శుభ సందర్భంగా… అమరావతికి మద్దతు పలికిన దేశ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతగా.ఈరోజు సాయంత్రం 7 గంటలకు వెంకటగిరి నియోజవర్గం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాలు మేరకు పెన్నా బద్దెవోలు బూత్ కన్వీనర్ వింజుం బాబురావు నాయుడు గారు ,వింజం మల్లికార్జున నాయుడు గారు ,తెలుగు దేశం పార్టీ నాయకులు దోసపాటి కిష్టయ్యనాయుడు ,మేక శశి ,గుధి రామయ్య,జయరామ్, చాట్ల తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పలుగునారు .బూత్ కన్వీనర్ వింజుం బాబురావు నాయుడు గారు ,వింజం మల్లికార్జున నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించా ఐక్యతకు ప్రతీకగా జ్యోతులను వెలిగించాం.అమరావతి నిర్మాణంతో 175 నియోజకవర్గాల యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి; ఇది పొరుగు రాష్ట్రాల రాజధానులకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది.ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని సాకారం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ,నారా లోకేష్ గారికి పెన్నా బద్దెవోలు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.