prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 1:50 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

హెచ్ పివి,టీకా -మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం

సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో హెచ్ పి వి, టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, జిల్లాలో ఉన్న 10,147 మంది 14 సంవత్సరాల బాలికలందరూ హెచ్‌ పి వి టీకా తీసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ టీకా ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని, ఒక్క డోస్ తీసుకుంటే సరిపోతుందని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ వినోద్ బాబ్జి, సీహెచ్‌ఐ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ సదానందం, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సురేష్ బాబు, జనరల్ ఆసుపత్రి వైద్యులు, నాసరుపు