*33వ వార్డులో పారిశుద్ధ్య పనులను నిర్వహించాలి…*
*కమిషనర్ చాంబర్లో నెల పై కూర్చొని నిరసన తెలిపిన కౌన్సిలర్ నాకోటి నాగేష్.*
*వార్డులో మున్సిపాలిటీ సిబ్బందిని నియమించాలి*
*యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 19 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 33 వార్డు విద్య నగర్ పరిధిలో గత నెల రోజుల నుండి మున్సిపాలిటీ సిబ్బంది , లేక వార్డులో చెత్త చెదారం నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుందని దీనితో వార్డు ప్రజలు అనారోగ్య లకు గురై ఆసుపత్రి పాలు అవుతున్నారని బిఆర్ఎస్ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ నాకోటి నాగేష్ ఆవేదన వ్యక్తం చేసారు. కమిషనర్ చైర్మన్ , వైస్ చైర్మన్ స్పందించి వెంటనే మున్సి పాలిటీ సిబ్బందిని నియమించాలని కమిషనర్ ఛాంబర్ లొ బైటాయించి నిరసన తెలపడం జరిగింది.