24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాలని రైతుల రాస్తారోకో
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 11 (ప్రజావాణి
24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ రోడ్డుపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతుల తరఫున సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి సిద్దిపేట విద్యుత్ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.