prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:38 pm Digital Edition : PRAJA VANI

హైతాబాదులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనం

హైతాబాదులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనం….
.. రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 18. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో నీ బంగారు మైసమ్మ గుడి పక్కన కొలువైన గణనాధుని.గత ఐదు రోజులుగా పూజలు అందుకున్న గణనాధున్ని గ్రామంలోని యువకులు ఆటపాటలతో గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్య లఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైతాబాద్ గ్రామంలోని చెరువులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ సర్పంచ్ కర్రోళ్ల  శాంతమ్మ యాదయ్యల ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలిగంటి మధుసూదన్ రెడ్డి. గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్. నిమజ్జన కార్యక్రమానికి హాజరైనట్లు హైతాబాద్ గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో గ్రామ ప్రజలు తమ సహాయ సహకారాలు అందించినట్లు సర్పంచ్ ఒక ప్రకటనలో తెలిపారు.   
21,000 కి లడ్డులు కైవసం చేసుకున్న కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యల కుమారుడు కే శివకుమార్. 11 వేలకు హైదర కూడా నర్సింలు లడ్డును కైవసం చేసుకున్నారు.. అదేవిధంగా హైతాబాద్ గ్రామానికి చెందిన మైసయ్య 5000 లడ్డులు కైవసం చేసుకున్నారని గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో హైతాబాద్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఒకటో వార్డు సభ్యులు పులి గారి బుచ్చమ్మ. ఐదవ వార్డ్ సభ్యులు కావలి రవి. ఎనిమిదవ వార్డు సభ్యులు బండి గారి సత్తయ్య. హైదరాబాద్. గ్రామ ప్రజలు హైదర్గూడ శ్రీనివాస్. పులి గారి కుమార్. కర్రోళ్ల లక్ష్మయ్య. మరియు హైతాబాద్  గ్రామ ప్రజలు. మరియు పాఠశాల విద్యార్థులు. గ్రామ ప్రజలు. యువకులు నాయకులు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్ పోలీసులు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జనానికి పోలీసులు సహకరించారని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.