prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:55 pm Digital Edition : MAHESH MEDCHAL

హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు*

*హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు*

*ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి*

మేడ్చల్ కీసర సెప్టెంబర్ 19

మేడ్చల్ జిల్లా: కీసర, రాంపల్లి దయారా లో హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.