హనుమకొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జిగా కరివేద మహిపాల్ రెడ్డి

**బెజ్జంకి మండలం దేవక్కపల్లికి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు*   బెజ్జంకి, సెప్టెంబర్ 4(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డిని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మహిపాల్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన కరివేద మహిపాల్ రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అభినందించారు.