prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 11:21 am Digital Edition : MAHESH MEDCHAL

స్వాతంత్ర్య సమరయోధుడు సింగిరెడ్డి మాధవరెడ్డికి ఘన నివాళి

స్వాతంత్ర్య సమరయోధుడు సింగిరెడ్డి మాధవరెడ్డికి ఘన నివాళి

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మాధవరెడ్డి సేవలు చిరస్మరణీయం: హరివర్ధన్ రెడ్డి

మేడ్చల్, సెప్టెంబర్ 19: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు సింగిరెడ్డి మాధవరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలోని మాధవరెడ్డి చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సింగిరెడ్డి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం, తెలంగాణ ప్రాంతం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

*ప్రజల కోసం నిరంతరం కృషి*

ఈ సందర్భంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి సింగిరెడ్డి మాధవరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడిగా ప్రజల కోసం విశేషంగా పనిచేశారని తెలిపారు. ప్రజల హక్కులు, ప్రాంత అభివృద్ధి, సామాజిక ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం మాధవరెడ్డి నిరంతరం కృషి చేశారని అన్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని హరివర్ధన్ రెడ్డి అన్నారు. మాధవరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

*భావితరాలకు సేవలను తెలియజేయాలి*

సింగిరెడ్డి మాధవరెడ్డి చేసిన సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలను నేటి యువత గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజాసేవ, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

*భారీగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు*

కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, అలియాబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాపరాజు, కిష్టాపూర్–పూడూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు, దుర్గం శివశంకర్ ముదిరాజ్, ఓబీసీ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గుర్ర రవి ముదిరాజ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్, కౌడే మహేష్ తదితరులు పాల్గొని మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల మహేష్ గౌడ్, బిపిటి రాజు, వేముల శ్రీనివాస్ రెడ్డి, రామన్నగారి సంతోష్ గౌడ్, చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్, రఘుపతి రెడ్డి, చంద్రయ్య గౌడ్, గణేష్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సింగిరెడ్డి మాధవరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.