prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 12:03 pm Digital Edition : VENKATESH BHIKNOOR

సిద్ధరామేశ్వర్‌నగర్ యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ ఏర్పాటు

బిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్‌నగర్ యూత్ కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గంధం రంజిత్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బసం నాగరాజును ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇతర కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కర్నాల శ్రీనివాస్, రామగల్ల బాబు మాట్లాడుతూ నూతన కార్యవర్గం యువతను సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

సమావేశంలో జనరల్ సెక్రటరీ ధ్యాగల కిరణ్, సెక్రటరీ కిరణ్, సిద్ధరామేశ్వర్‌నగర్ సీనియర్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింపేట లింగం, గంధం నగేష్, నాగూర్ మీరవాలి, గజ్జెల్లీ దుర్గబాబు, బత్తుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.