prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:13 am Digital Edition : PRAJA VANI

సత్యసాయి కాలనీలో ఘనంగా బాల గణేష్ పూజా కార్యక్రమం

సత్యసాయి కాలనీలో ఘనంగా బాల గణేష్ పూజా కార్యక్రమం

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 19 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

జోగిపేట: సత్యసాయి కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపంలో పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కాలనీ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు నర్సింలు,చింతల లింగం , పట్లోల్ల రవి,ప్రధాన కార్యదర్శి పటాలే సుభాష్ తో పాటు కమిటీ సభ్యులు వీరేశం,పల్లె వెంకటరమణ, వసుకుల హరికృష్ణ, నాగభూషణం, దేవిసింగ్, ఈ. సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.