శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం
పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 14 మన ప్రజావాణి
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల కార్యసిద్ధి కలగాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ చుంచు రమేష్ బాబు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాకలపాటి అనుసూర్య గగులోతు రమేష్ ఓర్సు సూరమ్మ సిరిపినేనీ అప్పారావు తన్నీరు గోపీనాథ్ శనగ వరపు వెంకటేశ్వరరావు కల్లూరి శ్రీవాణి కొలిపాక హైమావతి , ఎక్స్ అఫీషియో సభ్యులు యం తిరుపతిరావు మరియు ప్రధాన అర్చకులు శ్రీ యం. గోపి బాబు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు