వినాయక చవితి సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక
అలంకరణ
బల్కంపేట (ప్రజావాణి) సెప్టెంబర్ 14:
వినాయక చవితి సందర్భంగా బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల పూలు, వివిధ రకాల పండ్లు, పిండి వంటకాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు.
పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూల అలంకరణతో తీర్చిదిద్ది భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.