మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాయాసల్ ని పరామర్శించిన హుజుర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధికా అరుణ్ కుమార్ దేశముఖ్.
హుజూర్నగర్ సెప్టెంబర్ 18 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని మంచ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాయాసల్ గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. రాయాసల్ కి వారి స్వగృవుహానికి వెళ్లి పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని హుజుర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రాధికా అరుణ్ కుమార్ దేశముఖ్ అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు ధరవత్ నవీన్ నాయక్, స్థానిక సర్పంచ్ మాలోతు భద్రమ్మ బాబూ నాయక్, సేవాలాల్ కన్వీనర్ బానోతు తులసిరామ్ నాయక్, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ మొదలైన వారు పాల్గొని పరామర్శించటం జరిగింది.