prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:03 am Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు.

మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు.

 

హుజూర్నగర్ సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

 

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని మట్టపల్లి కృష్ణా నదిలో జరిగే వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా నదీ తీరంలో భారీ క్రేన్లు మరియు లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జన ఏర్పాట్ల పనులను హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు. విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.