*మంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్పర్సన్*
*మున్సిపల్ అభివృద్ధి కోసం వినతిపత్రం*
జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 ( మన సమగ్ర ప్రజావాణి ): హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పెంబర్తి వై జంక్షన్ వద్ద గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, జనగామ మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.