భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు
కూకట్పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లిలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణేశుడిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలు భక్తి వైభవంగా
కొనసాగుతున్నాయి.