బడా గణేశ్‌ సన్నిధిలో నీలం మధు ముదిరాజ్‌.. ప్రజా క్షేమం కోసం ప్రార్థన

*బడా గణేశ్‌ సన్నిధిలో నీలం మధు ముదిరాజ్‌.. ప్రజా క్షేమం కోసం ప్రార్థన *రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు పటాన్చెరు, సెప్టెంబర్‌ 18 (ప్రజావాణి):ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్‌ను మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. బడా గణేశ్‌ దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు నీలం మధుకు తీర్థప్రసాదాలు అందించి, వేద ఆశీర్వచనాలతో సత్కరించారు....