బండమీదపల్లి పాఠశాలలో కొలువుదీరిన గణనాథుడు
మన ప్రజావాణి
చౌడేపల్లి:
మండలంలోని బండమీదపల్లి పాఠశాలలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు గణేష్, గిరి, ప్రస్తుత ఉపాధ్యాయుడు లక్ష్మీపతి సహకారంతో, దాతలు నాగరత్నం రెడ్డి–నవనీతమ్మ దంపతుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఆలూరి సుబ్రహ్మణ్యం శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వెంకటస్వామి, మునెప్ప, సుబ్రహ్మణ్యం, పాఠశాల కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.