ఫెర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు
మరిపెడ ఏడి మురళి
తొర్రూర్ మండల కేంద్రంలో మరిపెడ వ్యవసాయ సహాయ సంచాలకులు మురళి, సోమవారం మండలం లోని పలు ఫర్టిలైజర్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇదులో భాగంగా ప్రతి డీలరు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు తదుపరి బోనస్ వచ్చే వరి సన్న రకాలను రైతులు రషీదు తీస్కుని వస్తే తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలి అని తెలిపారు . ఇందులో భాగంగా ఈనెల 10 వ తారీఖు చివరి తేదీ కాబట్టి రైతులు ఖచ్చితంగా ఆన్లైన్ చేయనుకోవాలి అని తెలిపారు.దుకాణల్లో కచ్చితంగా ధరల పట్టిక ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం లో తొర్రూర్ మండల వ్యవసాయ అధికారి రామ నరసయ్య వ్యవసాయవిస్తరణ
అ ధికారులు భరత్ చంద్ర వినయ్ వర్మ దీపిక, ప్రవీణ్ మరియు రైతులు పాల్గొన్నారు.