పౌష్టికాహారంతోనే చిన్నారుల ఎదుగుదల సాధ్యం
డి డబ్ల్యూ ఓ శారద, సి డి పి ఓ రమాదేవి
మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి,
అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందించే పౌష్టికాహారంతోనే చిన్నారుల ఎదుగుదల సాధ్యం అని డి డబ్ల్యూ ఓ శారద, సి డి పి ఓ రమాదేవి అన్నారు. మండలంలోని బైరాన్ పల్లి క్లస్టర్ పరిధిలోని దూలిమిట్ట అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రసన,అక్షరాభ్యాసం చేయించారు.అనంతరం వారు మాట్లాడుతూ పోషణ మాసం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంలో అందించే సేవలపై తల్లులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు అందించే మిల్లెట్స్ ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు లక్ష్మీ,రజిత,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.