పురోహిత, బిఆర్ఎస్ నాయకుడు జగన్ కుటుంబానికి ఆర్థిక సాయం

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు, ఆర్ఎంపి వైద్యుడు, డిడిఎన్ పురోహితులు సింహాచలం జగన్ ఇటీవల పరమపదించగా. ఈ విషయం తెలుసుకున్న డిడిఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షుడు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి, వారి తోటి పురోహితులంతా కలిసి జగన్ కుటుంబాన్ని పరామర్శించి. వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు, తమ డిడిఎన్ సంఘం తరఫున బాధిత కుటుంబానికి ₹22 వేల ఆర్థిక సహాయాన్ని అందించి. అధైర్య పడవద్దని, తామంతా ఉన్నామని ధైర్యం చెప్పారు.