నెల్లుట్ల చెరువు వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి) : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగేలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ గురువారం ok ప్రకటన లో తెలిపారు. ప్రధాన నిమజ్జన కేంద్రమైన నెల్లుట్ల చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.