prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 8:26 am Digital Edition : SURENDHARTEKUMATLA TEKUMATLA

నూతన సీఐని కలిసిన టేకుమట్ల బిజెపి పార్టీ నాయకులు

టేకుమట్ల/ప్రజావాణి:చిట్యాలసర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ ను టేకుమట్ల మండల బిజెపి పార్టీ అధ్యక్షులు గుర్రపు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఐ సతీష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్, సుబ్బక్కపల్లి సర్పంచ్ బొడ్డు రాజేందర్, భూపాలపల్లి జిల్లా నాయకులు కూర సురేందర్ రెడ్డి, దేశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు