prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 6:05 pm Digital Edition : PRAJA VANI

నిబంధనలు పాటిస్తే ప్రశాంతంగా ఉత్సవాలు.

*నిబంధనలు పాటిస్తే ప్రశాంతంగా ఉత్సవాలు.*
మంచాల సెప్టెంబర్ 13: (ప్రజావాణి) న్యూస్ టుడే తో *మంచాల సీఐ మధు** *డీజే మోతకు అనుమతి లేదు*
వినాయక చవితి ఉత్సవాలలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని మంచాల సీఐ మధు అన్నారు.
డీజే ఎక్కడైనా వాడుతున్నట్టు తెలిస్తే . చర్యలు తప్పవు పరిమితికి మించి శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు ఉదయం 10:రాత్రి 10 గంటల తర్వాత. మైకులు వాడకూడదు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాలి ఉత్సవాల సామరస్యంగా జరిగేలా యువత ఐక్యతను చాటాలి.. *సీసీ కెమెరాలకు ప్రాధాన్యత* మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీపం పెట్టేటప్పుడు.. జాగ్రత్త. హుండీ లడ్డు దొంగతనాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. కెమెరాలు ఉంటే దొంగలు ఆ ప్రాంతానికి రారు. వస్తే కెమెరాలకు చెక్కుతారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు ఇసుక అందుబాటులో ఉంచాలి. జూదం ఆడకూడదు మత్తు పదార్థాలు తీసుకోవద్దు. రాత్రి సమయంలో 11.తర్వాత యువకులు రోడ్ల పైన గల్లీలలో తిరగకూడదు. నియమ్మ నిబంధనలు పాటించకుంటే. తగిన చర్యలు తీసుకోబడతాయి.