prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:34 am Digital Edition : PRAJA VANI

నానో యూరియా పై రైతులకు అవగాహన సదస్సు

నానో యూరియా పై రైతులకు అవగాహన సదస్సు                         పెద్దవంగర సెప్టెంబర్ 07 ప్రజావాణి.                                                                                        .    పెద్ద వంగర మండలంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ. ఏ టీ ఎం ఏ  ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి గూగులోతు స్వామి నాయక్ ఆధ్వర్యంలో రైతులకు పొలంబడి కార్యక్రమంలో భాగంగా వరి పంటలో నానో యూరియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా టెక్నికల్ ఏవో శ్రీదేవి  మాట్లాడుతూ నానో యూరియా వాడకం వలన కలిగే లాభాలను రైతులకు వివరించడం జరిగింది. నానో యూరియా స్ప్రే చేయడం వలన మొక్కలకు కావాల్సిన యూరియా నేరుగా పత్ర రంద్రాల ద్వారా మొక్కకు చేరుతుంది దీనివలన నేల కాలుష్యంను నివారించవచ్చు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ  లు రాజు యాదవ్,విశ్వశాంతి, ఫెర్టిలైజర్ మరియు  ఫెస్టిసైడ్ అధ్యక్షులు.దామోదర్, ఉపాధ్యక్షులు.సురేష్, రైతులు పాల్గొనడం జరిగింది.