prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:59 pm Digital Edition : PRAJA VANI

తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య
– అంతారం గ్రామ శివారులో విషాద ఘటన

రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 19

షాబాద్ మండలంలోని అంతారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జిట్టా చంద్రశేఖర్ (16), తండ్రి లక్ష్మయ్య, గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు ప్రాథమికంగా సమాచారం.
ఈ క్రమంలో గ్రామ శివారులోని పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు