prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:50 pm Digital Edition : PRAJA VANI

డి జె నిర్వహణదారుల ముందస్తు బైండోవర్

డి జె నిర్వహణదారుల ముందస్తు బైండోవర్

నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయలు జరిమానా

మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్

మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,

గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దూర్ మరియు దూల్మిట్ట మండలాలకు చెందిన డీజే నిర్వహణదారులను సంబంధిత మద్దూర్,దూల్మిట్ట,ఏ. జి రహీమ్,శ్యామ్, తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు.