prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:05 pm Digital Edition : PRAJA VANI

జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ

*జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ*

*జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి):*

జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యం కోసం వచ్చిన ప్రజలకు నవీన్ విరాట్ అల్పాహారం సమర్పణ చేసి మానవత్వం చాటుకున్నారు.
ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ.. అల్పాహారం సమర్పణ చేసిన నవీన్ విరాట్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చూడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు, అనాథలకు, నిరుపేద కుటుంబాలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం, త్రాగునీరు అందించి మానవత్వాన్ని చాటుకోవాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు.
ఈ సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి, బొల్లం కనకరాజు, మంద సాయి, బింగి నరసింహులు, సిద్దిరాల చందు, పిట్టల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.