చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు….
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయం. ఎస్ టి ఓ. లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు. సోదాలు నిర్వహించారు. బాధితుడు నుంచి ఒక్క లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఏసీబీ బృందం రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో డబ్బులు స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెజరరీ ఎస్ టి ఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడితే ప్రభుత్వం అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని ఏసీబీఅధికారులు సూచించారు.
సమాప్తం….