నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి పుల్లెంల వాస్తవ్యులు బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి – రాజరాజేశ్వరి దంపతులు రూ.2 లక్షల భారీ విరాళం అందజేశారు. శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 2,00,000/- లను చందాగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దాతలను ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.