prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 1:08 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు గెల్లు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని నేతలు తెలిపారు. కార్యక్రమంలో పాతగూడూరు సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి, నాయకులు రవి, లచ్చయ్య, బాల్ లింగం, శ్రీనివాస్, అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యత, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.