prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:08 pm Digital Edition : PRAJA VANI

గుండ్లగడ్డ కిష్టబావి 28 వార్డు లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో అన్న ప్రసాదవితరణ

గుండ్లగడ్డ కిష్టబావి 28 వార్డు లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో అన్న ప్రసాదవితరణ

ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి.

అన్న ప్రసాద దాతలు 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా సమద్

జనగామ జిల్లా ప్రతినిధి .
సెప్టెంబర్ 17 ( ప్రజావాణి):
జనగామ పట్టణంలో 4వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విచ్చేసి అన్న ప్రసాదన్ని వితరణ చేశారు. ఈ అన్న ప్రసాద దాతలు 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా సమద్ ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ,కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఉత్సవ కమిటీ కోరుకుంది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు వడ్నల లింగమూర్తి, అధ్యక్షులు గట్టు రమేశ్, ఉపాధ్యక్షులు చిదిరలా బాబురావు, కోశాధికారి కోయలకర్ శేషు విరాట్ జీ, ప్రధాన కార్యదర్శి గుధినేని త్రయంబకేశ్,సహాయ కార్యదర్శులు ఆకుల నరేష్, గోగికర్ శివాజి, కొత్తపల్లి సత్తయ్య,
ఆర్గనైజర్ చెల్లోజు నవీన్ చారి, ముఖ్య సలహా దారులు ఎర్రమళ్ళ సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.