గణేష్ నిమజ్జనంలో నిబంధాలు పాటించాలి
డీజీలకు అనుమతి లేదు
.ఎస్సై దుర్గా రెడ్డి
సెప్టెంబర్ 18,(ప్రజావాణి)
కంగ్టి మండల పరిధిలోని గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి సూచించారు. మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు.ఊరేగింపులో క్రమశిక్షణ పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెరువులు, నీటి వనరుల వద్ద చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. గణేష్ నిమజ్జనానికి భక్తిశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలకు నిర్వాహకులకు పోలీసులు సహకరించాలని కోరారు.