prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 2:53 pm Digital Edition : PRAJA VANI

గంగారావు కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న చౌదరి

గంగారావు కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న చౌదరి

పలాస ప్రజావాణి ప్రతినిధి

పలాస నియోజకవర్గం పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి గ్రామం అవుగాన దశరద తండ్రి గారైన అవుగాన, గంగారావు ఇటీవల మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త వెంకన్న చౌదరీ ఆదివారము అవుగాన గంగారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగి ఉండాలని కోరారు.
వీరితో పాటు మల్లా శ్రీనివాస్, పీరికట్ల విఠల్ , తమ్మినేని గంగారాం , మురిపింటి కుమారాజా , పోలాకి పాపారావు పాల్గొన్నారు.