prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:07 pm Digital Edition : PRAJA VANI

కొత్త పింఛన్ల దరఖాస్తులపై విచారణ ప్రారంభం

కొత్త పింఛన్ల దరఖాస్తులపై విచారణ ప్రారంభం

లక్ష్మీపూర్‌లో క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ

బెజ్జంకి,సెప్టెంబర్ 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు.వితంతువులు, వికలాంగులు,గీత కార్మికులు,ఒంటరి మహిళలు సమర్పించిన దరఖాస్తులను ఏఈఓ రేణుక, పంచాయతీ కార్యదర్శి కిషన్ గ్రామంలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించారు.అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పింఛన్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.అనంతరం గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత -రత్నాకర్ రెడ్డిమాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.