ఏటూరునాగారం(ప్రజావాణి)
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో గురువారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ సీఐ ఎస్ఐ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రజా పాలనలో పోలీసుల పాత్ర కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఏఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.