ఎండపల్లి మండల కార్యాలయంలో ‘ప్రజావాణి’
ఎండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ప్రజల నుంచి 4 సమస్యల అర్జీలను అధికారులు స్వీకరించారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దొండ కృపాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన 11 మంది అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, స్వీకరించిన అర్జీలపై త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీడీవో ఆదేశించారు.