ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుజూర్‌నగర్‌ జాబ్‌మేళాలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? ఏ కంపెనీల్లో నియమించారు? ఎంపికైన వారి వివరాలను బహిర్గతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ కోదాడ, సెప్టెంబర్‌ 20 (ప్రజావాణి): జాబ్‌మేళాల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచి శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంతమంది ఎంపికయ్యారు, ఏ కంపెనీల్లో నియమితులయ్యారు, ఎంతమందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందాయి, ప్రస్తుతం ఎంతమంది...