కలసపాడు సెప్టెంబర్ 8 ప్రజావాణి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సభకు సంబంధించిన కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లాజరస్ మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశ రాజకీయాల్లో ముద్ర వేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభను ఈనెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కడప నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.సీతారాం ఏచూరి సేవలను కారు లాజరస్ కొనియాడారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శిగా మూడు దఫాలు ఎన్నికై పార్టీని సమర్థవంతంగా నడిపించారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీతగా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పిన తీరు ఆదర్శనీయమన్నారు. యూపీఏ- ప్రభుత్వ ఏర్పాటులోనూ, ఆ ప్రభుత్వం ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.పేదలు, కార్మికుల సంక్షేమం కోసం విప్లవాత్మక చట్టాలు రావడానికి ఏచూరి ఎనలేని కృషి చేశారని లాజరస్ పేర్కొన్నారు.వంటి చట్టాల రూపకల్పన వెనుక ఏచూరి ఒత్తిడి, పోరాటం ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కాకుండా కాపాడటంలో ఆయన ఎల్లప్పుడూ ముందున్నారని కొనియాడారు.
సిద్ధాంతకర్త..పోరాట యోధుడు
హిందుత్వ రాజకీయాలు, మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాదం, సామాజిక, ఆర్థిక సమానత్వాల కోసం ఏచూరి విస్తృతంగా రచనలు చేశారని నేతలు తెలిపారు. విభజన చట్టం హామీల సాధన కోసం, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మద్దతు తెలిపారన్నారు.అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాల్లోనూ నేరుగా పాల్గొని ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు.మహోన్నత నాయకుడైన ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కడపలో జరిగే సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్.నాగేశ్వరావు,దస్తగిరి,హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.