ఇంటి స్థలం కబ్జా యత్నంపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 18, ప్రజావాణి:
తమ కుటుంబం గత 50 ఏళ్లుగా నివాసముంటున్న ఇంటి స్థలాన్ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన బాధితుడు నిమ్మశెట్టి వెంకన్న ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్కు ఫిర్యాదు చేశారు.
తాము నివసిస్తున్న స్థలాన్ని కోంతమంది దొంగతనంగా తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఇల్లు ఖాళీ చేయకపోతే జేసీబీతో కూల్చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని జాటోతు హుస్సేన్ నాయక్ కు బాధితుడు వెంకన్న విజ్ఞప్తి చేశారు.