.ఆధారాలు ఉంటే చర్చకు రండి – సతీష్ రెడ్డికి సవాల్.
*ములుగు ప్రతినిధి/ప్రజావాణి:
ములుగు ప్రీమియర్ లీగ్ పేరుతో బెట్టింగ్ జరుగుతోందని BRS నేత సతీష్ రెడ్డి చేసిన ఆరోపణలను MPL నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు.
బెట్టింగ్ దందా జరుగుతుందని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై మండిపడ్డారు.
సూర్య ములుగు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ఎంతో సహకరించారని తెలిపారు.
ఆధారాలు ఉంటే తీసుకుని ఎక్కడికైనా చర్చకు వస్తామని సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు.
క్రికెట్ అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ విమర్శలు చేయవద్దని హెచ్చరించారు.
“క్రికెట్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ మీడియా సమావేశంలో బాను ప్రసాద్, పైడిమల్ల సందీప్, కిరణ్ పాల్గొన్నారు.
యువత కోసం క్రీడలను ప్రోత్సహించే వారిపై బురదజల్లడం మానుకోవాలని కోరారు.