స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న గడీల శ్రీనివాస్
80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామ్ చంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, చేతుల మీదుగా తొర్రూర్ మండ తహశీల్దార్ గా పని చేస్తున్న గడిల శ్రీనివాస్ కు ప్రజలకు ఆయన అందించిన ఉత్తమ సేవలను గుర్తించి ఉత్తమ ఉద్యోగిగా అవార్డ్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, నా యొక్క సేవలను ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డు అందించడం ఎంతో హర్షినియమని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ, నా యొక్క సేవలను, కర్తవ్యా దీక్షతో నిర్వహిస్తానని, ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా నాకు అవార్డు ప్రధాన చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామ్ చంద్రు నాయక్ కు, జిల్లా కలెక్టర్, స్నేహ శబరిష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశా.