prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:29 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

సంగారెడ్డి డీసీసీ పీఠం ఎవరికి కాంగ్రెస్‌లో అభిప్రాయ సేకరణ

•సంగారెడ్డి డీసీసీ పీఠం ఎవరికి?.. కాంగ్రెస్‌లో అభిప్రాయ సేకరణ

 

పటాన్చెరువు, ఆగస్టు 17 (ప్రజావాణి):సంగారెడ్డిలోని హోటల్ రెడ్లాస్ ఇన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగింది. ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు శ్రీనుబాబు, రియాజ్, నెరేళ్ల శారద హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తన అభిప్రాయాన్ని పరిశీలకుల బృందానికి వెల్లడించారు. ఆయన సతీమణి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ కూడా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాన్ని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు నమోదు చేసుకున్నారు.