prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:45 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

విద్యుత్ సరఫర అంతరాయం

విద్యుత్ సరఫర అంతరాయ

పోచారం, ఆగస్టు 21 (ప్రజావాణి): నారపల్లి విద్యుత్ విభాగం పరిధిలో వివిధ మూలధన పనులు, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు విద్యుత్ లైన్ క్లియరెన్స్ అవసరమైనందున శనివారం(22 ఆగస్టు)పలు ప్రాంతాల్లో స్వల్పకాలిక విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇన్ఫోసిస్ పరిసర ప్రాంతాలు, హాస్టళ్లు, ఏఎస్‌బీఎల్ నిర్మాణ ప్రాంతాలు, సెరేనియా హిల్స్, ఏవీ కన్‌స్ట్రక్షన్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్…….మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు దీంతో ఇన్ఫోసిస్ హాస్టల్ పరిధిలోని కాలనీలు, సెరేనియా హిల్స్, శివాలయం పరిసర ప్రాంతాలు, పోచారం గ్రామం, అన్నానగర్, డాక్టర్స్ కాలనీ, విజయ్ సాయి ఎన్‌క్లేవ్, గెలాక్సీ టవర్స్….. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు రామ్కీ, నీలిమా ఆసుపత్రి, అరుంధతి కాలనీ, వైభవ్ కాలనీ, మినీ సింగపూర్, మోడీ బిల్డర్స్, టులిప్స్ గ్రాండ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ శాఖ చేపట్టే పనులకు ప్రజలు సహకరించాలని నారపల్లి విద్యుత్ శాఖ అధికారులు కోరారు.