విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల దాడి సరైందికాదని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలంగాణ ఎస్సి పోరాట వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పంతం విజయెందర్, రాష్ట్ర కార్యదర్శి వెలిశాల శ్యామ్ అన్నారు.విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇవ్వాలనుకుంటే.. వారిపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేదాని అన్నారు. పోలీసులు ఇలా విద్యార్థులపై దాడి చేయ్యడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.జిల్లా పరిపాలన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తమ చేతుల్లో ఉందని సాధారణ ప్రజలపై విద్యార్థులపై ఇలా ప్రవర్తిస్తే సాహించేది లేదని అన్నారు. విద్యార్థులు వినతిపత్రం తీసుకుని వెళ్తే సమస్య పై విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఎస్సి జన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.