వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్
ఈరోజు మంగళవారం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని బుగులోని దేవాలయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో "మన అడవి – మన భవిష్యత్తు, పచ్చదనం పెంచడం – ప్రాణాలను కాపాడుదాం" అనే నినాదంతో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి జిల్లా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు....