
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:
తన జన్మదినం సందర్భంగా ఈఎల్వీ భాస్కర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి అరవింద్ లింబావలిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లింబావలి భాస్కర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అలాగే భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవలందించాలని లింబావలి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. భాస్కర్ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అరవింద్ లింబావలికి కృతజ్ఞతలు తెలిపారు.