రాజేష్ జన్మదిన వేడుకల సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ బీజేపీ యువ నాయకుడు రాజబొల్లారం రాజేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎంపీ ఈటల రాజేందర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజేష్ మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. యువత పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశంతో జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాజేష్కు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.