బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం -బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్
బెజ్జంకి, ఆగస్టు 14 (ప్రజావాణి) మండల స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 23 లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖల అధికారుల...